15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలి

10-06-2025 12:19 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూన్ 9 (విజ య క్రాంతి):కాకతీయ విశ్వవిద్యాలయంలో  కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన  రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆదివాసి గిరిజన బిడ్డలపై ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారత ప్రాంతాల్లోని అమాయకపు ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ సమర్ధిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూన్నామని చెప్పారు. ఆపరేషన్ కాగర్ తక్షణం నిలిపివేయాలని అన్నారు. 

టిపిసీసీ అధికార ప్రతినిధి కుచన రవళి, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, యూనివర్సిటీ విద్యార్థి విభాగ నాయకుడు అలువాల కార్తీక్, యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్ చందర్, భరత్ బచావో వెంగళ్ రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు శ్రవణ్, మహేష్ , క్రాంతి, భువన్, శివ, మనోహర్, సనత్ జయసూర్య, మనోహర్, శరత్, జున్ను రాజు, అరూరి రంజీత్, హతి రామ్ తదితరులు పాల్గొన్నారు.