19-06-2025 01:13:23 AM
-ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపునకు కేంద్రం చర్యలు
-నేడు భారత్కు చేరుకోనున్న 110 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ, జూన్ 18: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ‘ఆపరేషన్ సింధు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. టెహ్రాన్పై ఇజ్రాయె ల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ.. ఉత్తర ఇరాన్ నుంచి ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది భారత విద్యార్థులు నేడు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఈ నేప థ్యంలో బుధవారం ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి ప్రత్యేక విమానంలో విద్యార్థుల బృందం భారత్కు బయల్దేరింది. విదేశాల్లో ఉన్న తన పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. మరోవైపు ఇజ్రా యెల్ దాడులతో టెహ్రాన్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో తక్షణమే అక్కడ ఉన్న భారతీయులు భారత ఎంబసీ సాయంతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.