19-06-2025 12:43:34 AM
విశాఖపట్టణం, జూన్ 18: తెలంగాణలో తన ఫోన్తో పాటు తన భర్త, దగ్గరివాళ్ల ఫోన్లన్నీ ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘బైబిల్ మీద ప్రమా ణం చేసి చెప్తున్న..ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఫోన్ ట్యాపిం గ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా..’ అని స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్టణంలో షర్మి ల మీడియాతో మాట్లాడారు..
అప్పుడు ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ జగ న్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు కలిసే ఫోన్ ట్యాపింగ్కు ప్లాన్ చేశారన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా అణగదొక్కేందుకు స్కెచ్ వేశారని, ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డే తనకు చెప్పారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలను కూడా తనకు వినిపించారని చెప్పారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా.. అంటే అనుమానమేనన్నారు.
జగన్ తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారన్నా రు. కేసీఆర్, జగన్ బంధం వల్ల రక్తసంబంధం చిన్నబో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేశారని, తాను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదని కుట్రలు చేశారన్నారు.
అందులోభాగంగా ఫోన్ ట్యా పింగ్ కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్కు సంబంధంలేని అంశమని, కేసీఆర్ కో సం తనను తొక్కిపెట్టాలని చూశారన్నారు. ట్యాపింగ్పై చర్యలు తీసుకోవాలని, రెండు రాష్ట్రా ల ప్రభుత్వాలు ఫోన్ ట్యా పింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆమె కోరారు.