calender_icon.png 19 May, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత కలల సాకారమే మా ప్రభుత్వ లక్ష్యం

19-05-2025 12:25:48 AM

- యువతకు ఉపాధి చూపించడం కోసం జాబ్ మేళాల నిర్వహణ

-  రానున్న రోజుల్లో గోదావరిఖనిని సింగరేణి సిటీగా తీర్చిదిద్దుతాం

- యువత ఉపాధి కోసం సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళాల నిర్వహణ భేష్

-  గోదావరిఖని మెగా జాబ్‌మేళాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ 

- సింగరేణి జాబ్ మేళాలో 3,000 మందికి ఉపాధి సీఎండీ బలరామ్

మంథని మే18 (విజయ క్రాంతి) రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిరుద్యోగ యువతీ యువకుల కోసం 60 వేల ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం జరిగిందని, ఇటువంటి జాబు మేళాల నిర్వహ ణ  ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉ పాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ లు పేర్కొన్నారు. 

సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఆదివారం మే 18వ తేదీన నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన వారు సింగరేణి సిఎండి ఎన్. బలరామ్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క మల్లు, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో యువత  ఉద్యోగ నియామకాల తో పాటు రాజీవ్ యువ వికాస, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా నైపుణ్యాల ను పెంపొందిస్తూ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకు న్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా ప్రభుత్వ సంస్థ సింగరేణి సహకారంతో యువతకి ఉపాధి కల్పించేందుకు గోదావరి ఖని లో నిర్వహించిన ఈ జాబ్ మేళా కోసం హైదరాబాదు నుంచి 100 ప్రై వేట్ సంస్థలని ఇక్కడికి  రప్పించిన  సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.   

ఎమ్మెల్యే  మాట్లాడుతూ నే టి ఆధునిక కాలంలో  యువత ప్రపంచంలో ఏ మూలన ఉద్యోగ అవకాశాలు ఉన్నా సరే వాటినిఅందిపుచ్చుకోవాలని , కేవలం స్థానికంగానే ఉపాధి కోసం ప్రయత్నిస్తే అవకాశా లు తక్కువగా ఉంటాయని, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కార్యక్రమం ద్వారా రా ష్ట్రానికి చెందిన యువతకు సివిల్స్ ఆకాంక్షలను సాకారం చేసుకోవడంలో విజయవం తమయ్యామని గుర్తు చేశారు.

అలాగే ఒకప్పుడు ప్రముఖ నగరంగా , పారిశ్రామిక కేం ద్రంగా వెలుగొందిన గోదావరిఖని ప్రస్తుతం చిన్న పట్టణ స్థాయికి పడిపోయిందని ,మళ్లీ ఈ పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని,ముఖ్యంగా సింగరే ణి కాలరీస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున సింగరేణి సిటీగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

సింగరేణి సహకారంతో రాను న్న రోజుల్లో నగరంలో పలు కీలక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పే ర్కొన్నారు .ప్రతి నిరుద్యోగి కూడా తమకు వ చ్చిన అవకాశం వినియోగించుకుంటూ అం చెలంచెలుగా ఎదగాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అభిలాషించారు.

సింగరేణి చైర్మన్, ఎండీ ఎన్ బలరాం మాట్లాడుతూ ఉద్యోగం లేని యువత కు సమాజంలో చిన్న చూపు ఉంటుందని , దాన్ని దూరం చేసి వారిలో  ఆత్మవిశ్వాసం నింపేందుకు జాబ్ మేళా ల ను ఏర్పాటు చేసినట్లు వివరించారు .రాను న్న రోజుల్లో సింగరేణి అన్ని ఏరియాల్లో ఇ లాంటి జాబ్ మేళాలను సామాజిక బాధ్యత కార్యక్రమంగా ఏర్పాటు  చేయనున్నామని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ప్రజా ప్రభు త్వం కొలువుదీరిన తర్వాత సింగరేణిలో 30 వినూత్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు అలాగే సిం గరేణిలో అవినీతి ప్రక్షాళనకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు ముఖ్యంగా శ్రమజీవులైన కార్మికులను మోసగిస్తున్న అక్రమార్కు లను  కటకటాల వెనక్కి పంపిస్తున్నామని  వి వరించారు.

మున్ముందు కూడా కార్మికులను  మాయమాటలతో మోసగించే వారిని,  వే ధించే వారిని వదిలిపెట్టబోమన్నారు అలాగే సాయంత్రం జాబ్ మేళా ఫలితాలను వెల్లడి స్తూ మొత్తం 5100 మంది యువత హాజరుకాగా అందులో 3029 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు కార్యక్రమంలో గుర్తింపు , ప్రాతినిధ్య, అధికారుల సంఘ నాయకులు రాజ్ కుమార్, సదానందం, నరసింహులు, ఏరియా జీఎం లలిత్ కుమార్ మాట్లాడారు .

జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్య అతిథులు హర్కర వేణుగోపాల్  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,   ఎన్. బల రా మ్ నియామక పత్రాలు అందజేశారు .హైదరాబాద్ కంపెనీలను గోదావరిఖనికి తీసుకు వచ్చి తమ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు క ల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.