12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

పేపర్ బోర్డ్ మాటున రియల్ దందా?

19-05-2025 12:42 AM

- కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములు

- పట్టించుకోని పంచాయతీ, రెవెన్యూ అధికారులు

 కొత్తగూడెం మే 18( విజయక్రాంతి); ప రిశ్రమల స్థాపనకు కారు చౌకగా ప్రభుత్వ భూములు పొంది నామమాత్రంగా పరిశ్రమలు స్థాపించినట్టు చేస్తూ ప్రభుత్వ భూము ల్లో అక్రమ వెంచర్లతో స్థిరాస్తి వ్యాపారం జో రుగా సాగుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ పరిసర ప్రాంతంలో యదేచ్చగా ప్ర భుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు గెలుస్తున్నాయి.  సర్వే నెంబరు 137/1.  20 కుంటల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఈ భూమికి త ప్పుడు సర్వే నెంబర్ 137/2/A చూపి  ప్రైవే ట్ పట్టా భూమి పేరుతో కాగితాలు సృష్టించారు.

2004 సంవత్సరంలో విజయవాడ కు చెందిన నాగ వెంకట శ్రీలక్ష్మి  ఈ  భూ మిని కొనుగోలు చేసి, బండా రామిరెడ్డి వద్ద నుండి ఓ అట్టల ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు.  ఈ ఫ్యాక్టరీ కి ఎలాంటి అనుమతులు లేవని ఆరోపణలు ఉన్నాయి. మరో చోట ఉన్న శ్రీ పద్మాలయ పేపర్ బోరడ్స్ అనే ఫ్యాక్టరీ అ నుమతు లను చూపుతూ, ప్రభుత్వానికి చె ల్లించాల్సిన పన్నులకు వేగనామం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

పద్మాలయ పేపర్ బోరడ్స్ పాల్వంచ మండలం దంతాల బోర గ్రామానికి చెందిన ఒక గిరిజనుడిని బినామీగా  నమోదు చేసినట్లు సమాచారం. ఇటీ వల బినామీ గిరిజనుడికి, కర్మాగారం నిర్వహకులకు మనస్పర్ధలు వెలబడటంతో విష యం వెలుగు చూసింది.

ఒకవైపు అనుమతు లు లేకుండా అట్టాల ఫ్యాక్టరీ నడుపుతూ, మ రోవైపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ వెంచర్లతో భూదందా సాగుతున్నట్లు తెలుస్తోంది.ఇంత జరుగుతున్న రెవెన్యూ, పంచాయతీ, పరిశ్రమల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం తో పెద్ద మొ త్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో ఈ స్థలంపై ఎల్ టి ఆర్ కేసులు నమోదైన ఎటు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ కల్పించుకొని చెంచుపల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కు ఏరియాలో జరుగుతున్న భూధందా పై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూములను పరిర క్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.