calender_icon.png 5 June, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డగోలు దోపిడీ!

04-06-2025 12:00:00 AM

  1. పుస్తకాలపై 10 శాతం అదనపు వసూళ్లు 
  2. బుక్క చీటిలపై బిల్లులు 
  3. ఇదేటని ప్రశ్నిస్తే పుస్తకాలు లేవు.. అంటున్నా వైనం 
  4. పుస్తకాల సెట్ కావాలంటే.. ఇతర సామగ్రి కొనాల్సిందే 

వనపర్తి, జూన్ 3 (విజయక్రాంతి): జూన్ నెల వచ్చిందంటేనే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి. అప్పటి వాళ్ళ ఆర్థిక స్థోమత ఇతర కారణాల మంచి విద్య ను అందిపుచ్చుకోలేక చాలి చాలని వేతనాలతో పూట గడుపు తున్న తరుణంలో కూడా తమ పిల్లలకు మంచి విద్యానందించెందుకు ప్రవేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ చదివి స్తున్నారు. జూన్ నెల రాగానే ఒకవైపు పాఠశాల ప్రారంభం కావడం తో విద్యార్థులకు ముందుగా నూతన పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇతర సామాగ్రి అప్పులు చేసి మరి కొనుగోలు చేస్తుంటారు. 

పుస్తకాలపై 10 శాతం అదనపు వసూళ్లు

ప్రవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు చాలావరకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలకు సమీపంలో ఒక చిన్నపాటి గదిని ఏర్పాటు చేసి ప్రత్యేక పుస్తకాలు అంటూ ఆమ్మడం వంటివి సహజంగా చూస్తుంటాం ఇది ఒక రకం.  జిల్లా కేంద్రం లో బుక్ స్టోర్ వంటి షాపులలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న అడిగే నాథుడు కరువు కావడంతో వారు ఆడిందే ఆట పాడింది పాటగా ఇష్టాలసారంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఏమి చేయలేక నిసాహాయ స్థితిలో  వా రు చెప్పిన రేటుకే డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 

నర్సరీ నుండి మొదలుకొని అరవ తరగతి వరకు ఆయా పాఠశాలలో పుస్తకాలలో కొనుగోలు చేస్తుంటారు. ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విధిగా ప్రభుత్వ పుస్తకాలు మాత్రమే వాడాలన్న నిబంధన ఉండడంతో కొనుగోలు చేయాలంటే విధిగా బుక్ స్టోర్లకు వెళ్లాల్సిందే. ఇదే అదునుగా  భావించిన  జిల్లా కేంద్రంలోని బుక్ స్టోర్లో యజమానులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.

ఎంతలా అంటే పుస్తకాలు కావాలంటే విద్యార్థులు కావలసిన ప్రతి వస్తువు ( పుస్తకాలు,  పెన్నులు, పెన్సిళ్లు మిగతా ఇతర వస్తువులు ) వాళ్ళు చెప్పి న రేటుకు కొనుగోలు చేస్తేనే ప్రభుత్వ పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది ఆ పుస్తకాలు కూడా పుస్తకాలపై ఉన్న ఎమ్మార్పీ ధరకు అదనంగా 10 శాతం వేసి మరి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 

ఇదేటని ప్రశ్నిస్తే పుస్తకాలు లేవు అంటున్నా వైనం 

సాధారణంగా 500 రూపాయలకు పైబ డి ఏ వస్తువులు కొనుగోలు చేసిన అం దుకు సంబంధించిన జిఎస్టితో కూడిన రసూల్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అదేమీ మాకు సంబంధం లేదు అన్నట్టుగా బుక్ స్టోర్ యజమానులు వ్యవహరిస్తున్నారు. వేలకు వేల రూపాయలు బిల్లులవు తున్న ఆయా షాప్ లకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకుండా తెల్ల పేపర్ పై బిల్లులు వేసి ఇస్తున్నారు.

తర్వాత ఏ అధికారులు వెళ్లిన మేము ఇవ్వలేదు మాకు సం బంధం లేదన్నట్టుగా ఉండేందుకు ఇది ఒక రకమైన బిజినెస్ ట్రిక్. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా ఎందుకు వసూల్ చేస్తున్నారం టూ కొనుగోలుదారుడు ప్రశ్నిస్తే మా దగ్గర ఇలాగే ఉంటుంది కావాలంటే తీసుకోండి లేదంటే లేదు అంటూ సమాధానం ఇవ్వడమే కాకుండా ఇతర వస్తువుల సైతం ఇవ్వ కుండా చెప్పిన రేటుకే తీసుకోవాలని దబాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.  

చోద్యం చూస్తున్న అధికారులు...

ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఏ వస్తువులు విక్రయించరాదు . విక్రయించిన ప్రతి వస్తువుకు కచ్చితంగా ఆ యొక్క షాప్ పేరు మీద రసీదు ఉండాలి కానీ ఇవేమీ లేకుండా బుక్క చిట్టి లపై బిల్లులను రాస్తూ లక్షల్లో జీఎస్టీ ఎగవేస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  సామాన్యుడు మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్న సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో మూడు పుస్తకాలు ఆరు నోట్ల కట్టల్లాగా జీరో దందా ను యదేచ్చగా చేస్తున్నారు.