పదిలో ఆక్స్ ఫర్డ్ స్కూల్ ఉత్తమ ఫలితాలు
ముషీరాబాద్,ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్(ఓజిఎస్) మార్చి 2026లో నిర్వహించిన ఎస్ఎస్సీ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేసిందని స్కూల్ కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల టాపర్లు అరుణ్ శ్రీ సుధాంశు, సౌరభ్ రాజ్ పురోహిత్, ఇద్దరూ 91 శాతం మార్కులు సాధిం చినట్లు చెప్పారు.
అదనంగా, 2 మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా, 19 మంది విద్యార్థులు 80 శాతం నుండి 90 శాతం మధ్య మార్కులు సాధించి పాఠశాల విద్యా ప్రతిభను ప్రతిబింబించారని పేర్కొన్నారు. విద్యతో పాటు లైఫ్ సైన్సెస్, ఫైన్ ఆరట్స్, క్రీడలు, గేమ్స్ వంటి సహపాఠ్య కార్యకలాపాలపై సమాన ప్రాధాన్యత ఫలితంగానే ఈ అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు.
స్కూల్ డైరెక్టర్ ప్రార్థన మణికొండ, డీన్ రామాంజుల విద్యార్థుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమగ్ర మార్గదర్శకత్వం, ప్రోత్సాహంతో విద్యా ప్రమాణాలను నిలబెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులలో సత్కరించి అభినందించినట్లు చెప్పారు.






