వరి, మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలి
సీపీఎం, రైతు సంఘం తహసీల్దార్కు వినతి
కూసుమంచి, ఏప్రిల్ 22(విజయక్రాంతి): మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద నెలలు గడుస్తున్న వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు మాట్లాడుతూ...
రైతులు పండించిన పంట ఐకెపి కేంద్రాల వద్ద ఉంచి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వెంటనే మొక్కజొన్న వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం పాలే డివిజన్ అధ్యక్షులు బిక్కసాని గంగాధర్, చేగోమ్మ సొసైటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు జగన్ మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, కర్ణబాబు, కృష్ణంరాజు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.






