calender_icon.png 9 November, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

09-11-2025 07:21:00 PM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..

చండూరు/మర్రిగూడెం (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి, మద్దతు ధర పొందాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం శివన్న గూడెం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోశారనీ, అయితే నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని అన్నారు. రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగలేదని, రైతులు మాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో రైతులు నేరుగా రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడి, క్వింటాలుకు రూ.1600-1800 మాత్రమే ఇస్తూ మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పత్తి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం రైతులపై పెద్ద భారమని విమర్శించారు. "రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, వెంటనే ధాన్యం కొనుగోలు చర్యలు ప్రారంభించి, రైస్ మిల్లులను కేటాయించి, బోనస్ చెల్లించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రైతు సంఘం మండల నాయకులు మైల నాయకులు సత్తయ్య. డివైఎఫ్ఐ మండల నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర ప్రజానాట్యమండలి మండల నాయకులు గడ్డం రాంబాబు రైతులుఎరుకలి బిక్షం.. నీలకంఠం శివ  జంగయ్య రాములు నరసింహ తదితరులు పాల్గొన్నారు.