23-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 23 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని పద్మ నాయక మినీ కళ్యాణ మండపంలో ఆదివారం పద్మనాయక వెలమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. మొదటగా దివంగతులైన సభ్యులకు సంతాపము తెలియజేస్తూ మౌనం పాటించారు.
అనంతరం వార్షిక నివేదికను సభ్యులకు చదివి వినిపించి, ఎజెండా అంశాల పై చర్చించి ఆమోదించారు. అనంతరం ప్రధాన హాలు ను ఎ/సి హాలుగా పునఃనిర్మాణము చేయుటకు సహకరించిన దాతలను సన్మానించారు.అదేవిధంగా ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగుస్తున్నందున.. హాల్ నిర్మాణం కొనసాగుతున్నం దున మరో నాలుగు నెలలు పదవీ కాలం జనరల్ బాడీలో ఏకగ్రీవంగా పొడిగించారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు గండ్ర సంపత్ రావు, సంయుక్త కార్యదర్శి బోయినిపల్లి భూపతిరావు, కోశాధికారి నిమ్మనేని భీంరావు, కార్యవర్గసభ్యులు జువ్వాడి అనిల్ రావు , వాలా శంకర్రావు,చిట్నేని మోహన్ రావు, సుంకిశాల సంపత్ రావు, జూపెల్లి మాధవరావు, చిట్నేని రఘురాం రావు, జోగినపల్లి రాజగోపాల్ రావు, పల్లేపాటి వేణుగోపాల్ రావు, అయిల్నేని సుధాకర్ రావు గండ్ర మంజుల, తదితరులుపాల్గొన్నారు.