6 July, 2026 | 1:51 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

అట్టుడుకుతున్న పాకిస్థాన్

27-11-2024 02:49 AM

ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని నిరసనకారుల డిమాండ్

ఆందోళనల్లో ఐదుగురు మృతి

ఇస్లామాబాద్, నవంబర్ 26: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులకు, భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఒక నిరసనకారుడు సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం దేశ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఆదివారం పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌తో ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డెక్కారు. నిరసనకారులు దేశ రాజధానివైపు కదిలి సోమవారం ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించారు. మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. కాగా, నిరసనకారులను అడ్డుకునేందుకు రాజధానిలో సైన్యం మోహరించింది. షూట్ ఎట్ సైట్ ఆదేశాలను అధికారులు జారీ చేశారు. ఈ ఆందోళనలకు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీతోపాటు ఖైబర్ పఖ్తుఖ్వ సీఎం అలీ అమీన్ గడ్డాపూర్ నేతృత్వం వహిస్త్నురు.