ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు
నేరేడుచర్ల,జూలై 06(విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల్లో గుడిసె లు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చి, పక్కా ఇల్లు నిర్మించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు హైదరాబాద్ బయలుదేరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు మరియు సివిల్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న
ప్రతి ఒక్క నిరుపేదలకు పట్టాలు ఇచ్చి,పక్కా ఇల్లు మంజూరు చేయాలని సోమవారం ఇందిరాపార్క్ దగ్గర వామపక్ష పార్టీల పిలుపుమేరకు నేరేడుచర్ల నుంచి హైదరాబాదుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో గుడిసె వాసులు బయలుదేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు వాసపల్లయ్య, డివిజన్ నాయకులు వాస కరుణాకర్ షేక్ రజాక్ చందన బోయిన లక్ష్మి వేమునూరు పావని, విజయ్ ఆనంద్ సయ్యద్ దేవయ్య మల్లేశ్వరి చెన్నమ్మ మరియమ్మ తదితరులున్నారు.






