12-06-2025 11:16:10 PM
నడిగూడెం: కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూతుకూరి వెంకటరెడ్డి(Congress Party Mandal President Buthukuri Venkata Reddy) అన్నారు. నడిగూడెం మండలం, కేశవాపురం గ్రామనికి చెందిన మాజీ కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలడుగు ప్రసాద్ (పెద్దబాబు) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందడం పట్ల కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియ జేశారు. పలువురు నాయకులు పాల్గొని సంతాపం ప్రకటించారు.