calender_icon.png 12 June, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూన్ చివర, జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు

17-05-2025 08:39:52 PM

- స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయండి..

- ఇంటిని చక్కదిద్దినట్లు రాష్ట్రాన్ని ప్రభుత్వం చక్కదిద్దుతుంది..

- నిజమైన కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుంది.. 

- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి.. 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA Madhusudhan Reddy) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అబ్జర్వర్లు దొమ్మటి సాంబయ్య, భాస్కర్ యాదవ్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డిలతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. 

కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసిన ఒక్క పిలుపుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ధన్యవాదాలు తెలియజేశారు, ఇదే స్ఫూర్తి, ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతో స్థానిక ఎన్నికల్లో ముందుకు సాగి జయకేతనం ఎగురవేద్దామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకెళ్తే, రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ కు డిపాజిట్లు దక్కవన్నారు, రాబోయే జూన్ చివర, జూలై నెల మొదటి వారంలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం లభిస్తుందని తెలియజేశారు. టికెట్ ఎవరికీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో పదవులు వరిస్తాయని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

అనంతరం టీపీసీసీ అబ్జర్వర్లు మాట్లాడుతూ పార్టీ నిర్మాణమే అన్నింటికంటే ముఖ్యమని, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం మరియు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో తలపెట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ను గ్రామస్థాయి, బూత్ తీసుకెళ్లాలని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామ మండలతో పాటు తదితర పార్టీ క్యాడర్ సంబంధించిన పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,  నాయకులు తదితరులు ఉన్నారు.