calender_icon.png 13 December, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

11-12-2025 12:00:00 AM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, డిసెంబరు 10 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సప్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నిక లు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంట ర్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రా ల్లోని ప్రతి కౌంటర్ ను, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు.

ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధన లను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, తదితరులుఉన్నారు.