20-12-2025 02:25:18 AM
అహ్మదాబాద్, డిసెంబర్ 19 : టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భార త తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గిల్ స్థానంలో సంజూ శాంసన్, హర్షిత్ రాణ స్థానంలో బుమ్రా, కుల్దీప్ యా దవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేలా ఆడాడు. భారీ షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అటు అభిషేక్ శర్మ కూడా దూకుడు గా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 5.4 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు.
అభిషేక్ 34 (21 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్), సంజూ శాంసన్ 37 ( 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిలయ్యాడు. అయితే హైదరాబాదీ బ్యాటర్ తిల క్ వర్మ, హార్థిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. ముఖ్యంగా పాండ్యా వి ధ్వంసం సృష్టించాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్సర్ బాదాడు. తర్వాత సఫా రీ బౌలర్లను ఎడాపెడా బాదేశాడు. అతని బ్యాటింగ్ కు బంతులు బుల్లెట్లలా బౌండరీలకు దూసుకెళ్ళాయి.
అటు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..పాండ్యా కేవలం 16 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్టీల్ చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. పాండ్యా, తిలక్ విధ్వంసంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్యా 63 (25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు), తిలక్ వర్మ 73 (10 ఫోర్లు, 1 సిక్స్ ) పరుగులు చేశారు. ఛేజింగ్లో సౌతాఫ్రికా దూకు డుగా ఆడింది. ఓపెనర్లు హెండ్రిక్స్ , డికాక్ తొలి వికెట్ కు 69 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..
హెండ్రిక్స్ ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. తర్వాత బ్రెవిస్ కూడా దూకుడుగా ఆడడంతో సౌతాఫ్రికా సంచలనం సృష్టించేలా కనిపించింది. అయి తే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు సౌతాఫ్రికాను కట్టడి చేశారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటకీ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపించి 4 వికెట్లు తీశాడు. దీంతో సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. మార్క్ కర్మ్ (6), ఫెరీరియా (0), లిండే (16), మిల్లర్ (18) పరుగులకు వెనుదిరిగారు. చివర్లో యెన్సన్ రెండు సిక్స ర్లు కొట్టినా అతన్ని బుమ్రా పెవిలియన్ కు పంపాడు. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 , బుమ్రా 2 , పాండ్యా , అర్షదీప్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 231/5 ( తిలక్ వర్మ 73, హార్థిక్ పాండ్యా 63 , సంజూ శాంసన్ 37, అభిషేక్ శర్మ 34 ; బోస్చ్ 2/44, బార్ట్ మన్ 1/39)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 201/8 ( డికాక్ 65, బ్రెవిస్ 31 , మిల్లర్ 18 ; వరుణ్ చక్రవర్తి 4/53, బుమ్రా 2/17 )
టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ పరాభవానికి వన్డే సిరీస్ విజయంతో రివేంజ్ తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్ తో మరో దెబ్బకొట్టింది. అహ్మదాబాద్లో హార్థిక్ పాండ్యా. తిలక్ వర్మ విధ్వంసం సృష్టిస్తే.. బ్యాటింగ్ పిచ్ పై వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. దీంతో ఆఖరి మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో గెలిచి 3-- తో సిరీస్ కైవసం చేసుకుంది.