29-06-2025 02:04:23 AM
న్యూఢిల్లీ, జూన్ 28: భారత విదేశీ గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)కు నూతన అధిపతిగా శనివారం కేంద ప్రభుత్వం పంజాబ్కు చెందిన 1989వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ను నియమిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమి టీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రా అధిపతిగా కొనసాగుతున్న రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నే పథ్యంలో కేంద్రం సీనియర్ ఐపీఎస్ అయి న పరాగ్ జైన్ను నియమించింది.
కొత్తగా ని యామకం అయిన పరాగ్ జైన్ రెండేళ్ల పా టు రా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కొత్త రా అధిపతి పరాగ్ జైన్ జూలై 1న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1989 పంజాబ్ క్యాడర్కు చెందిన పరాగ్ జై న్కు రెండు దశాబ్దాల పైచిలుకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ప్రస్తుతం రాలోని ఏవి యేషన్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్సీ) హెడ్గా కొనసాగుతున్నారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు విరుచుకుపడిన విష యం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పరాగ్ జైన్ ఆధ్వర్యంలోని ఏఆర్సీ ప్రముఖ పాత్ర పో షించింది. క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడంలో ఏఆర్సీది ముఖ్యభూమిక పోషించింది.
పంజాబ్లో టెర్ర రిజం వల్ల పరిస్థితులు అదుపుతప్పినపుడు పరాగ్ జైన్ పంజాబ్ ఎస్ఎస్పీ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీజీపీ) హోదాలో కీలకంగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో, ఖలిస్థానీ ఉగ్రవాదుల కదలికలు తెలుసుకునేందుకు శ్రీలంక, కెనడా లలో కూడా విధులు నిర్వర్తించారు. 2021 జనవరిలో పరాగ్ జైన్ పంజాబ్లో డీజీపీ ర్యాంక్ పొందారు.