05-06-2025 12:00:00 AM
ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ, జూన్ 4: జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నా యి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశం కానున్నట్టు ప్రకటిం చారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ తేదీలను నిర్ణయించినట్టు ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ స మావేశాలను ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయ మై ఇండియా కూటమికి చెందిన 16 రాజకీయ పార్టీలు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశాయి.
ప్రత్యేక సమావేశాల డిమాండ్పై రిజిజు మాట్లాడుతూ... ‘మాకు ప్రతి సమావే శం ప్రత్యేకమైందే. అన్ని ప్రధానాశాంలు చర్చిస్తాం. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) లో నిర్ణయించిన ప్రకారం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తాం.’ అని పేర్కొన్నారు.