25 February, 2026 | 1:54 AM

పాటిగడ్డ ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃసమీక్షించాలి

25-02-2026 12:16 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కోట నీలిమ విజ్ఞప్తి 

సనత్‌నగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి):- పాట్టిగడ్డ కాలనీ నుంచి రసూల్ పుర జంక్షన్ వరకు ప్రతిపాదిత ఫ్లైవోవర్ ప్రాజెక్టు మార్గాన్ని పునఃపరిశీలించి ప్రజలకు నష్టం కలగకుండా మార్పులు చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా. కోట నీలిమ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కు విజ్ఞప్తి చేశారు. స్థానికులతో కలసి ఆమె కమిషనర్ ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెక్లెస్ రోడ్ నుంచి పాటిగడ్డ వరకు ప్రతిపాదిత ఫ్లైవోవర్ మార్గం వల్ల పాటిగడ్డ కాలనీలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఫ్లైవోవర్ నిర్మాణం జరిగితే 40కు పైగా ఇండ్లు, వివిధ వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇందులో భాగంగా స్థానికులు అభ్యర్థిస్తూ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ ను కమిషనర్ కు సమర్పించారు.

స్థానికుల అభ్యర్థన మేరకు ఫ్లైఓవర్ మార్గాన్ని పున:సమీక్షించి పేదల ఇండ్లను, వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని.. అందుకు అనుగుణంగా ప్రత్యా మ్నాయ మార్గాన్ని చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాటిగడ్డ స్థానికులు, బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.