24-05-2025 05:03:23 PM
ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి..
తుంగతుర్తి (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్(PD Act) నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి డి.శ్రీధర్ రెడ్డి(District Agriculture Officer D. Sridhar Reddy) అన్నారు. శనివారం మండల కేంద్రంలో విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి మాట్లాడారు. నకిలి విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని, ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం వస్తుందని సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. కొందరు షాప్ యజమానులు కావాలని తమ షాపులను లాక్ చేసి వెళ్లారని, వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు.