24-05-2025 05:00:51 PM
సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒక ఆటో ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. సారంపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు కార్లు అతివేగంగా రావడంతో ఢీకొన్న సంఘటన చోటుచేసుకుందని అదే సమయంలో వస్తున్న ఆటోకు ఢీకొనడంతో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108 అంబులెన్స్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.