21-06-2025 05:25:36 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లా ఆసుపత్రిలో చైతన్య జ్యోతి మహిళా సంఘం ద్వారా క్యాంటీన్ ప్రారంభించినట్లు అదనపు డిఆర్డీఓ రవీందర్(Additional DRDO Ravinder) తెలిపారు. శనివారం అదనపు డిఆర్డీఓ రవీందర్ జిల్లా ఆస్పత్రిలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు డిఆర్డీఓ మాట్లాడుతూ... కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు డైట్ కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, ఈ కాంట్రాక్ట్ 2 సంవత్సరాల పాటు ఉంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం రోగులకు అందించాలని, అనంతరం రోగులకు అదనపు డిఆర్డిఓ అల్పాహరం, లంచ్ అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.