19 June, 2026 | 5:14 PM

Breaking News

మృతి చెందిన మావోయిస్టు పొలాలలో తవ్వకాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడు బాధ్యత   •   పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి   •   కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •  

పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

19-06-2026 04:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అందవలసిన నోటి బుక్స్ యూనిఫామ్స్, హాస్టల్ వసతి వంటి ఉచిత సదుపాయాలకు అవరోధాలు కలగకుండా చూడాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకి వినతి పత్రం అందజేయడం జరిగింది. సమస్యని తొందరగా పరిష్కరించాలని లేని యెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జే.అశోక్, టీ.సురేందర్, ముత్యం, రమేష్ తదితర విద్యార్థి తల్లితండ్రులు పాల్గొన్నారు.