calender_icon.png 20 June, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ భూభాగంలో ఆదివాసులను రక్షిస్తూ కాపాడండి

20-06-2025 05:05:34 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District)లోని ఆధి పూర్వం నుండి ఆనాదిగా అదే గ్రామంలో జీవిస్తున్నా ఆదివాసీలను ఆధారాలతో చట్టబద్ధంగా రక్షిస్తూ కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర(District Collector Divakara T S)కి తుడుం దెబ్బ, ఎమ్మార్పీయస్ ముఖ్య నేతలు కలిశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి ములుగు జిల్లా ఎస్సీ ఎస్పీ అట్రాసిటీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు చింత కృష్ణ ఆదివాసి మాట్లాడుతూ... ములుగు జిల్లా భూభాగం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూభాగమని ఇట్టి భూభాగాన్ని కాపాడాల్సిన దేశ అత్యున్నత ఇండియన్ సర్వీసెస్ అధికారులే చోద్యం చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శివపురం షెడ్యూల్డ్ ఏరియా గ్రామంలో ఆనాదిగా గ్రామాన్ని నిర్మాణం చేసుకొన్న వట్టం, పూనెం వంశస్తులైనటువంటి తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్ జిల్లా ముఖ్య బాధ్యులు పూనెం నాగేశ్వరరావు శాస్త్ర సాంకేతికంతో కూడిన అటవీ హక్కుల చట్టం పట్టా బుక్కు ఉన్నటువంటి ఆదివాసీ  భూములను గిరిజనేతరులు అక్రమంగా లాక్కోవడం అంటే చట్టాలను ఏ విధంగా గిరిజన రక్షణ అధికారులు ఏ విధంగా రక్షిస్తున్నారో అధికారులు ప్రజలు ప్రజాస్వామ్య మేధావులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత రెవెన్యూ,పోలీస్ యంత్రాంగం సమస్యను సమస్యగా కాకుండా కొంత సమయం వేచి ఉండాలి అని ఉన్నతాధికారులే చెప్పినప్పటికీ శివపురం గ్రామ ప్రజలలో (కొందరు మాత్రమే) గిజనేతరులైన వారు రెండు దినముల క్రితం రాత్రి కాల సమయంలో అటవీ హక్కుల ఆదివాసిల పట్టా భూమిని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో అట్టి భూమిని మళ్లీ సాగు చేసుకునే పనులను ట్రాక్టర్లతో చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ పోరాటాల కార్యకర్త నెమలి నర్సయ్య మాదిగ నాయక పోడ్ దెబ్బ వ్యవస్థాపక పోలీట్ బ్యూరో సభ్యులు బొల్లెం సారయ్యనాయక పోడ్ ఎమ్మార్పీఎస్/మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల స్వామిమాదిగ, తుడుం దెబ్బ, ములుగు జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రమేష్ మాదిగ, తుడుం దెబ్బ, కార్యదర్శి ఈక జగ్గారావు,నాయక పోడ్ దెబ్బ మహిళా విభాగం జిల్లా నేత పెరుమాళ్ళ భాగ్యలక్ష్మినాయక పోడ్, బుస్సాపురం ఏజెన్సీ ఆదివాసీలు కుర్సం ముత్తయ్య, ఉసం లావణ్య తదితరులు పాల్గొన్నారు.