13-02-2026 06:28:30 PM
భక్తులకు అసౌకర్యకం కలుగకుండా చర్యకు చేపట్టాలి
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రికి మూడు రోజులపాటు నిర్వహించనున్న జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, మహా జాతర పెండింగ్ పనులు శనివారం మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్య కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ట్రాఫిక్, త్రాగునీరు, పార్కింగ్, సంస్కృతిక కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు, ఇతర పెండింగ్ లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.