9 April, 2026 | 8:52 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

గరిడేపల్లి గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందజేత

13-02-2026 06:29 PM

గరిడేపల్లి,ఫిబ్రవరి 13,(విజయ క్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి గ్రామపంచాయతీ కి ప్రీజర్ బాక్స్ ను దాతలు శుక్రవారం అందజేశారు.ఎవరైనా మరణించిన సమయంలో మృతదేహాన్ని వారి బంధువులు,కుటుంబ సభ్యులు దూరం నుంచి గ్రామానికి చేరేవరకు ఫ్రీజర్ లో ఉంచే అవకాశం ఉండటంతో దీనిని గ్రామపంచాయతీకి అందజేసినట్లు దాతలు తెలిపారు.గరిడేపల్లి కి చెందిన  ప్రధాని కిష్టయ్య పేరుమీద వారి కుమారులు ప్రధాని నాగయ్య,ప్రధాని రామ్మూర్తి, ప్రధాని సైదులు,ప్రధాని వెంకటేశ్వర్లు బహూకరించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి,ఉప సర్పంచ్ మాతంగి సంజీవ,మేకపోతుల అఖిల్,మాజీ సింగిల్ విండో చైర్మన్ పెండెం ముత్యాలు గౌడ్,గట్టి గొప్పల కృష్ణారెడ్డి,బండ సీతారాంరెడ్డి,గుంటూరు రాము,గుండు సైదులు,పెండెం కాశయ్య,మేకపోతుల రామకృష్ణ,రాగిరెడ్డి చంద్రారెడ్డి,మేకపోతుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.