02-12-2025 02:15:32 AM
నాగిరెడ్డిపేట, డిసెంబర్ 1 (విజయ క్రాంతి):మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో 36 మంది సోమవారం చేరారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు.
పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా.. మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారనన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.