02-12-2025 02:15:12 AM
కాంగ్రెస్లో చేరిన కార్యకర్తలు
కొల్చారం, డిసెంబర్ 1 :కొల్చారం మండ లం రంగంపేటలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో అధికార కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీటీసీ రా జ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి దుర్గేష్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.