calender_icon.png 6 June, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. 11 మంది మృతి

04-06-2025 08:17:20 PM

బెంగళూరు: బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు(Royal Challengers Bangalore team) విజయోత్సవ పరేడ్(RCB Victory Parade) సందర్భంగా తొక్కిసలాటలో జరిగింది. చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద తొక్కిసలాటలో మహిళలు సహా 11 మందికి పైగా మరణించిన సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైనది. బౌరింగ్ ఆసుపత్రిలో ఏడుగురు, వైదేహి ఆసుపత్రిలో నలుగురు మృతి చెందారని, ఆసుపత్రుల్లో ఉన్నవారిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar) పరామర్శించారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 50 మందికి గాయపడిన ఆర్సీబీ అభిమానులను ఆసుపత్రికి పోలీసులు తరలించారు. భారీగా వచ్చిన అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 


ఈ సందర్భంగా కర్ణాటక శాసనమండలి సభ్యుడు హరిప్రసాద్ బికె మాట్లాడుతూ... తుపాకి దాడిలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి తగిన చికిత్స అందించడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. మృతులకు నా సంతాపం, వారి కుటుంబాలకు నా సంతాపం అని హరిప్రసాద్ బికె ట్వీట్ చేశారు. ఈ ఘటనతో ఆర్సీబీ ప్లేయర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిలిపివేశారు. అంటూ చిన్నస్వామి స్టేడియం వైపు వచ్చే మెట్రో, ఇతర వాహనాలను తాత్కాలికంగా పోలీసులు నిలిపివేశారు.