18 April, 2026 | 11:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-04-2025 12:00 AM

రెండు కుక్కలపై దాడి చేసిన చిరుత

దౌల్తాబాద్, ఏప్రిల్ 25: వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి మరోసారి కలకలం రేపింది. రెండు కుక్కలపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనను గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్ వేణు లు చేరుకుని చిరుతపులి పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా గుర్తించా రు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని, చిరుత పులి ఒకే చోట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని తెలిపారు. అడవికి దగ్గర వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచకుండా ఇళ్లలోకి తీసుకొచ్చుకోవాలన్నారు. చిరుత పులి కనిపిస్తే వెం టనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులెవ్వరు పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవద్దని తెలిపారు.