calender_icon.png 9 August, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

09-08-2025 02:02:45 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ 

కామారెడ్డి, ఆగస్టు 8 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవన్ పేట్, పోతారం వెళ్లే దారిలో భవానిపేట్ వాగు ఉధృతిని పరిశీలించారు. నీటి ఉధృతి అధికంగా ఉన్న నీటి ప్రభావం వంతెన కంటే ఒక ఫీట్ వరకు రాకముందే ఆ దారిలో వాహనాలు మనుషులు జంతువుల రాకపోకలు ఆపివేయలని ఆర్ అండ్ బి మోహన్ రెడ్డిని ఆదేశించారు.

జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గ్రామస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో వాట్సాప్ గ్రూప్లు, దండోరా వేయించి ప్రజలకు సమాచారం చేరవేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ భారీ వర్షంలో పాల్వంచ మండలంలోని భవానిపేట్ నుండి పోతారం వెళ్లే దారిలో గల భావానీపేట్ వాగును ఉధృతిని  జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తో కలిసి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ఉధృతి అధికంగా ఉన్నందున  నీటి ప్రవాహము వంతెన కంటే ఒక ఫీట్ వరకు రాకముందే ఈ దారిలో వాహనములు మరియు మనుషులు, జంతువుల రాకపోకలు ఆపివేయాలని ఆర్ అండ్ బి ఈఈ మోహన్ మరియు డిఈలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.   ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్, ఆర్ అండ్ బి ఈ ఈ  మోహన్ రెడ్డి, డీఈలు పాల్గొన్నారు.