06-06-2025 12:24:35 AM
వనపర్తి, జూన్ 5 ( విజయక్రాంతి ) : భూ భారతి రె వెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలను సూచించారు. రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం పెబ్బేరు మండలంలోని రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలంలోని నాగసాని పల్లి గ్రా మాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సం దర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉ ద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తమ భూ సమస్యలు ఏము న్నా నిర్ణిత ప్రొఫార్మలో పూరించి అధికారులకు ఇవ్వాలని అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తార న్నారు. షెడ్యూలు ప్రకారం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చౌక ధర దుకాణాల్లో రికార్డులు సరిగ్గా నిర్వహించాలి
ప్రతి చౌక ధర దుకాణంలో బియ్యం నిల్వలు, లబ్ధిదారులకు ఇచ్చిన బియ్యం తదితర రికార్డులు సక్రమంగా నిర్వ హించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని నాగసాని పల్లి గ్రామంలోని చౌక ధర దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ సరిగ్గా చేయాలని, రో జువారీగా రికార్డులు నవీకరణ చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ స్వంత ఇంటి కల సాకారం చేసుకోవాలి
మొదటి విడతలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకొని లబ్ధిదారులు తమ స్వంత ఇంటి కల నెరవేర్చుకోవాలని సూచించారు. నాగసాని పల్లి గ్రామంలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సం దర్శించారు.
గోవిందమ్మ భర్త పేరు కుర్మయ్య ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు లక్ష రూపాయ లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, త్వరలోనే మిగిలిన డబ్బులు జమ చేయడం జరుగుతుందని భరో సా కల్పించారు. త్వరగా పూర్తి చేసుకొని స్వంత ఇంటి కల సాకారం చేసుకోవాలని సూచించారు.
తేమ వచ్చిన వెంటనే వరి తూకం చేసి మిల్లుకు తలించాలి
వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తేమ చూసుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే తూకం చేసి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం పె బ్బేరు మండలంలోని పాతపల్లి గ్రామ ఐ.కే.పి సెంటరును కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఇంకా ఎంత వడ్లు ఉన్నాయి, వాటి తేమ శాతం ఎంత ఉంది అనే వివరాలు అ డిగి తెలుసుకున్నారు.
వడ్లు కొనుగోలు చివరి దశకు చేరుకుందని, తేమ వచ్చిన వడ్లను తూకం చేసి లారీల్లో నింపుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లై అధి కారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, పెబ్బేరు తహసిల్దార్ పి. మురళి, ఆర్.ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.