06-06-2025 12:23:55 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, జూన్ 5: పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు మంజూరు చేయించే బాధ్యత నాదని, పదవి ఉన్న లేకున్నా నా జీవితం మునుగోడు ప్రజలకే అంకితం అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
గురువారం మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశ లో అర్హులైన నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులకు మునుగోడు లోని క్యాంపు కార్యాలయం వద్ద అట్టహాసంగా పండుగ వాతావరణం లో ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి చండూరు మున్సిపాలిటి, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన లబ్ధిదారులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం తో కలిసి ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఇండ్లు మంజూరు అయిన ప్రతి ఒక్క లబ్దిదారునికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఇండ్లు రాని వాళ్ళు అధైర్య పడొద్దు అర్హులైన పేద వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు.నియోజకవర్గం లో కనీసం పదివేల ఇండ్లు మంజూరి అవసరం ఉంది. ప్రస్తుతానికి 3500 మంజూరు అయ్యాయి అని అన్నారు.కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు ప్రభుత్వం ఇస్తుందనీ తెలిపారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,రెవిన్యూ. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,కార్యకర్తలు లబ్ధిదారులు ఉన్నారు.