calender_icon.png 17 February, 2026 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు

17-02-2026 08:42:49 PM

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు తిరిగి మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తెలంగాణ ప్రజల జాతిపిత కెసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో మండల టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయినప్పటికీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చటములో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయుటకు పూర్తిస్తారని లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందని అన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే హామీలను నెరవేర్చకపోవడంతో మళ్లీ కెసిఆర్ ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు, దొంగరి శ్రీనివాస్, సర్పంచులు తప్పట్ల ఎల్లయ్య ,కుంచాల శ్రీనివాస్ రెడ్డి చింతకుంట్ల మనోజ్,  రమేష్, ఉప సర్పంచ్ కవిత మట్టపల్లి వెంకట్ ,బొజ్జ సాయికిరణ్, గోపగాని రమేష్ గౌడ్ ,గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, మల్యాల రాములు, తడకమల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.