17-02-2026 08:39:29 PM
93.52 పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు
కోదాడ: తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ ఐఐటీ & మెడికల్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి మంచి పర్సంటైల్ సాధించినట్లు ఆ అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్యలు మంగళవారం తెలిపారు. కాలేజ్ కు చెందిన వై.శరణ్య అన్ని విభాగాలలో 93.52 పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు.
అదే విధంగా మ్యాథ్స్ విభాగంలో కాలేజీకు చెందిన ఎన్.యశస్వినిని 98.27, పీ. అమృత సుధా వర్షిణి 97.69 పర్సంటైల్ సాధించినట్లు వారు తెలిపారు. కాలేజ్ కు చెందిన 50 మంది విద్యార్థులకు పైగా 90కి పైగా పర్సంటైల్ సాధించి ఐఐటీ లు, ఎన్ ఐ టీ లలో సీట్లు పొందేందుకు అర్హత సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ వడ్డే రాజేష్, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, వైస్ ప్రిన్సిపాల్ పీఎన్ఆర్, క్యాంపస్ ఇంచార్జి మౌనిక, పలువురు లెక్చరర్లు అభినందించారు.