1 May, 2026 | 7:25 PM

Breaking News

ఎమ్మెల్యే మార్నింగ్ వాక్.. గుడ్ మార్నింగ్ పేరుతో పల్లెలన్నింటిని చుట్టుముట్టి సమస్యలు పరిశీలించి   •   మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి   •   నియోజకవర్గం స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   కార్మికుల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు   •   శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు   •   మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేవరకు పోరాడుతాం.....   •   తిమ్మంపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్   •   మే డే స్ఫూర్తితో లేబర్ వ్యతిరేక చట్టాలు రద్దుకు పోరాటం   •   విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

పీపుల్స్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ శిబిరం

08-01-2026 05:14 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లఫంగినర్సింహా ఆధ్వర్యంలో మాల్ పట్టణ పీపుల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో గురువారము వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ క్యాంపులో మహిళలకు, గర్భిణీలకు, పెద్దలకు, పిల్లలకు సంబంధిత ప్రాథమిక వైద్య సేవలను డాక్టర్లు అందజేశారు. అత్యవసర పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు రోగులు హాజరయ్యి చికిత్స పొందాలని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచి లపంగి నరసింహ మాట్లాడుతూ, గ్రామంలో లోని ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగంపరచుకొని, అందరూ ఆరోగ్య వంతులుగా ఉండాలనీ, అదేవిధంగా అత్యవసర సేవలందించడానికి అంబులెన్స్ సౌకర్యాలు కూడా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు ఉన్నాయని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం క్యాంపులో పీపుల్స్ హాస్పిటల్ సంబంధించిన క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు.