12 March, 2026 | 12:29 PM

ప్రజాభవన్ లో వినతి

28-10-2025 10:27 PM

జడ్చర్ల: డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ మంగళవారం ప్రజా భవన్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై ప్రజాభవన్ ఇన్చార్జి చిన్నరెడ్డి, అధికారిని దివ్యను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినపత్రాన్ని అందజేశారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. దీనిపై వారు స్పందించి సమాచార శాఖ కమిషనర్ కు ఫోన్ లో మాట్లాడి  సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు.