20-06-2025 12:00:00 AM
అశ్వాపురం, జూన్ 19 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గొందిగూడెం గ్రామం నుండి అశ్వాపురం మధ్య గల ఇసుక వాగుపై సుమారు రూ7 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి , రోడ్డును గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు బ్రిడ్జి పనులను కాసులకు కక్కుర్తి పడి ,కాంట్రాక్టర్లకు లాభాలు చేరుకునే విధంగా పనులలో జాప్యం చేశారనీ, నేడు ప్రజా ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం బ్రిడ్జి పనులను వేగవంతంగా జరిపి వచ్చే వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, మాజీ ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ , మాజీ సర్పంచ్ పాయం భద్రమ్మ , నెల్లిపాక సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.