18 April, 2026 | 2:26 AM

ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక

18-04-2026 12:53 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల అమలుపై సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రవాణ, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణశాఖ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీరెడ్‌కో ఎండీ అనిలా వవిల్లా, ఓఈఎం ప్రతినిధులు పాల్గొన్నారు.