12 June, 2026 | 1:50 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

అమ్మ జ్ఞాపకంగా మొక్క నాటండి

12-07-2024 01:00 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని.. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా ప్రతి ఒక వ్యక్తి చెట్టు నాటాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బీజెపీ కార్యాయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మ గౌరవాన్ని పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్క నూ సంరక్షించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలన్నారు. కాంక్రీట్ జంగిల్ మారుతున్న మన పరిసరాలను కాపాడుకునే బాధ్యత మనపై ఉందన్నారు. పచ్చదనాన్ని పరిరక్షిస్తేనే ప్రకృతి వైపరీత్యాలు తగ్గుతాయని అన్నారు. అడవులు తరిగిపోవడం భవిష్యత్తుకు ఒక పెను సవాల్ లాంటిదన్నారు.