06-06-2025 12:53:21 AM
చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య
చేవెళ్ల, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యత గా తీసుకోవాలని చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య పి లుపునిచ్చారు. గురువారం ప్రపం చ పర్యావరణం దినోత్సవం సందర్భంగా చేవెళ్ల కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. మొక్క లు ప్రాణకోటికి జీవాధారమని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, బాలస్వామి, నర్సింలు, మరియు న్యాయవాదులు రాజశేఖర్, రామకృష్ణ, శివరాజ్ , సిహెచ్ రవీందర్, బి ఆనంద్,గిరి, విఠల్ ,అభిలాష్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి ,ప్రవీణ్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డి, ప్రకాష్పాల్గొన్నారు.