28-07-2024 05:21:31 PM
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ కు తొలి పతకం అందించిన మనుకు అభినందనలు అని తన ఎక్స్ ఖతాలో మోదీ రాసుకోచ్చారు. తొలి మహిళగా చరిత్ర సృష్టించినందుకు ఈ గెలపు మరింత ప్రత్యేకం అని ప్రధాని మోదీ తెలిపారు. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించడంతో, పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరిచింది.మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కు తొలి పతకం గెలిచింది.
