17 August, 2026 | 10:43 PM

మను భాకర్ విజయం.. అసంఖ్యాక యువతులకు స్ఫూర్తి

28-07-2024 05:46 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మను భాకర్‌కు అభినందనలు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్ తెలిపారు. ఆమె పారిస్‌లో భారతదేశానికి పతకాలను తెరవడమే కాకుండా షూటింగ్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు. "మను భాకర్ సాధించిన విజయం ఒలింపిక్ పోడియంలో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్న అసంఖ్యాక యువతులకు స్ఫూర్తినిస్తుంది" అని ధంఖర్ తెలిపారు. ఆమె విజయం సాధించినందుకు భాకర్‌ను అభినందిస్తూ, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్  ఎక్స్ వేదికగా ఇటా ట్వీట్ చేశారు.