బాధ్యతలు చేపట్టిన ప్రధాని.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి కిసాన్ నిధి 17వ విడత విడుదల ఫైల్ పై సోమవారం నాడు మోడీ తొలి సంతకం చేశారు. ఈ పథకం ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, దాదాపు ₹20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని తెలిపారు. సౌత్ బ్లాక్ లోని పీఎంవో నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టారు.
‘‘కిసాన్ కల్యాణ్కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.






