నేడు తెలంగాణకు నరేంద్రమోదీ

30-04-2024 05:00:00 AM

జహీరాబాద్ పరిధిలో బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని

సంగారెడ్డి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గ్‌లో నేడు నిర్వహించే భారీగా బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ మేరకు జన సమీకరణకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను 40 ఎకరాల్లో నిర్వహిస్తుండగా.. 50 వేల మందిని సమీకరించాలని బీజేపీ అధినాయకత్వం దిశానిర్దేశం చేసింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గల నుంచి ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి కార్య కర్తలను, నాయకులను తరలిస్తున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సభకు జాతీయ, రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లును జహీరా బాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే వారి వాహనాలను నిలిపిందేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సభా స్థలం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. హైదరాబాద్ నుంచి మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బహిరంగ సభకు చేరుకుంటురాని నిర్వహకులు తెలిపారు. దీంతో అధికారులు ప్రత్యేక హెలికాప్టర్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు.