31 July, 2026 | 8:19 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

అయోధ్యకు ప్రధాని మోదీ..

25-11-2025 08:25 AM

న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ్ లల్లా ఆలయంలో(Ram Janmabhoomi) నేడు పవిత్ర ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతోంది. ధ్వజారోహనం కార్యక్రమానికి ప్రధాని మోదీ(PM Modi) హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సప్తరుషి మందిరానికి మోదీ వెళ్లనున్నారు. సప్తరుషి మందిర దర్శనానంతరం శేషావతార మందిరానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు అన్నపూర్ణాదేవి మందిరాన్ని దర్శించుకోనున్నారు. రామ్ లల్లా మందిరాన్ని దర్శించి ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రామ్ లల్లా మందిర శిఖరంపై ధ్వజారోహణం చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేయనున్నారు. కాషాయరంగు గల ధర్మధ్వజాన్ని ప్రధాని ఎగరవేయనున్నారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్లు చిహ్నాలున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారు. మోదీ అయోధ్య పర్యటన దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.