calender_icon.png 17 June, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా పోచమ్మ బోనాలు

16-06-2025 12:00:00 AM

అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం మొక్కులు

హుస్నాబాద్, జూన్ 15 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం పోచమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా  పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుస్నాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి, పట్టణంలోని రెండవ వార్డులో ఉన్న పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రమంతా మంచి వర్షాలు పడి,  పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లాలని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు సాగాలని అమ్మవారిని మొక్కుకున్నానన్నారు. అనంతరం ఆయన ఎల్లమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు.