24 August, 2026 | 10:38 PM

Breaking News

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •  

మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతో పోలీసు కమిషనర్ సమావేశం

24-08-2026 09:15 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీల పెద్దలతో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.... మిలాద్ ఉన్ నబి పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. పండుగలకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా చివరి రోజు జరిగే జులూస్ శాంతియుతంగా జరగాలని ఆయన సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సాధారణ షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి , తిరుమల్ గౌడ్ మరియు మిలాద్ ఉన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.