05-12-2025 12:16:08 AM
కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ శాంతియుత వాతా వరణంలో ఎన్నికల నిర్వహణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం అన్నారు. స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేసిన సంధర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయికృష్ణ పుష్పగుచ్ఛం అందిం చి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు గౌరవ వందనం స్వీకరిం చారు, ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ఎన్నికల సంసిద్దతను తెలియజేశారు.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలు, బైండోవర్ చర్యలు, చెక్పోస్టులు, ఎన్ఫోర్స్మెంట్ బృందా ల పనితీరు, స్వాధీనపు వివరాలు, పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు మొబైల్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. జిల్లా పరిధిలోని డీఎస్పీలను డీజీపీ స్వయంగా మాట్లాడి వారి పరిధిలోని భద్రతా ఏర్పాట్లు, సమస్యలు, ఫోర్స్ వినియోగంపై ప్రత్యక్ష వివరాలు సేకరించారు.
రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం అని ముఖ్యంగా స్తానిక సంస్థల ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని తెలి పారు. కావున ప్రతీ ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని అధికారులకు తెలిపారు. జిల్లాలో సున్నితమైన పోలింగ్ కేంద్రాల గ్రామాల వివరాలను అడిగి అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికల అనంతరం ఆదేరోజు విజయోత్సవ ర్యాలీలయందు వివాదములు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఎవరు ర్యాలీలు తీయరాదని తెలిపారు. జిల్లాలో 30 వ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ముoదస్తూ అనుమతులు తప్పనిసరి అని సూచించారు.
ఆదేశా లను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంలో బైండోవర్ చేసిన వ్యక్తులలో ఐదుగురు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించగా, వారి పూచికత్తుగా చూపిన డబ్బులపై జరిమానా విధించినట్లు వివరించారు. బైండోవర్ పేపర్కు మాత్రమే పరిమితం కాకుండా, ఎవరైనా బైండోవర్ సంబంధిత నియమ నిబం ధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించబడతుందని తెలిపారు. నియమాలను ఉల్లం ఘించిన వ్యక్తులపై చట్టపరమైన తగు చర్యలు కూడా తీసుకోబడతాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం అని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి , నిజామాబాద్ అదనపు కమీషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.