నల్లమల ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. పోలీసులు ఒకవైపు బందోబస్తు నిర్వహిస్తూనే మరోవైపు భక్తులకు విశిష్ట సేవలు అందించి భక్తులతో శభాష్ .. అనిపించుకుంటున్నారు. నాగర్కర్నూల్కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు లింగమమ్మ గురువారం సలేశ్వరం జాతరకు వచ్చింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆమె ఇబ్బందిపడుతున్నదని కానిస్టేబుల్ రాం దాస్ గమనించారు. ఆయన వెంటనే స్పందించి వృద్ధురాలిని తన భుజాలపైకి ఎత్తుకుని స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. అలాగే ఇద్దరు భక్తులు మూర్ఛ వచ్చి పడిపోగా కానిస్టేబుళ్లు వెంకట్రాములు, రాముడు వారి ని సకాలంలో వైద్యశిబిరానికి తరలించి కాపాడారు. పోలీసుల మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు.
అచ్చంపేట, ఏప్రిల్ 25 (విజయక్రాంతి)